న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జిమ్ సంఘం ఇవాళ ఆందోళన నిర్వహించింది. నగరంలో జిమ్లు ఓపెన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని జిమ్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా నగరంలోని జిమ్లను మూసివేశారు. అయితే అన్ని వ్యవస్థలను ఓపెన్ చేశారని, కానీ కేవలం జిమ్లను మాత్రమే మూసివేస్తున్నట్లు వాళ్లు ఆరోపించారు. జిమ్లు మూసి ఉండడం వల్ల అప్పులు పెరిగిపోతున్నాయని, బాకీలు కట్టాల్సి ఉందని ఓ ఆందోళనకారుడు తెలిపాడు.