న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిైళ్లె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేధింపులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి, సమాచారాన్ని రాబట్టారని ఆరోపించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని, రిమాండ్లో ఉంచడాన్ని సవాల్ చేస్తూ, ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై వైఖరిని తెలియజేయాలని ఈడీని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. పిైళ్లెని ఈడీ అధికారులు మార్చి 6న అరెస్టు చేయడం, ఆయనను ట్రయల్ కోర్టు రిమాండ్కు, ఈడీ కస్టడీకి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలకు విరుద్ధమని ఆయన తరపు న్యాయవాది నితీష్ రాణా వాదించారు. తదుపరి విచారణ నవంబరు 3కు వాయిదా పడగా.. అదే రోజున పిైళ్లె బెయిలు దరఖాస్తుపై కూడా విచారణ జరుగుతుంది.