న్యూఢిల్లీ : ఢిల్లీ-దోహ ఇండిగో విమానంలో ఓ ప్రయాణీకుడు తీవ్ర అస్వస్ధతకు లోనవడంతో విమానం పాకిస్తాన్లోని కరాచీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ వైద్య బృందం అక్కడకు చేరుకునేలోపే ప్రయాణీకుడు మరణించాడని ఎయిర్లైన్ అధికారులు తెలిపారు.
ఢిల్లీలో దోహ వెళ్లే ఇండిగో విమానం ఆదివారం రాత్రి 10.17 గంటలకు టేకాఫ్ అయింది. ఆపై ప్రయాణీకుడు అస్వస్ధతకు గురువడంతో పాకిస్తాన్లోని కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దురదృష్టవశాత్తూ అప్పటికే ప్రయాణీకుడు మరణించాడని ఎయిర్పోర్ట్ వైద్య బృందం నిర్ధారించింది.
విమానంలోని ఇతర ప్రయాణీకులను గమ్యస్ధానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎయిర్లైన్ వర్గాలు తెలిపాయి. మృతుడి కుటుంబ సభ్యులకు ఎయిర్లైన్ ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Read More :