న్యూఢిల్లీ, జూలై 7: మహిళా రెజర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. చార్జ్షీట్లో నేరారోపణలకు సంబంధించి బలమైన సాక్ష్యాలు ఉన్నందు న ఈ నెల 18న విచారణకు రావాలని ఆదేశించింది.
సస్పెండ్ అయిన రెజ్లింగ్ సమాఖ్య అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను విచారణకు రమ్మ ని కోర్టు పిలిచింది. ‘పోలీసుల రిపోర్ట్, బాధితుల వాంగ్మూలం, ఇతర దస్ర్తాలు, ఆధారాలను కోర్టు పరిగణనలోనికి తీసుకొని వివిధ సెక్షన్ల కింద నిందితులకు సమన్లు జారీ చేసింది’ అని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ వెల్లడించారు.