న్యూఢిల్లీ: పోలీస్ను ఒక దొంగ కత్తితో పొడిచి చంపాడు. అయితే అక్కడున్న జనం కళ్లప్పగించి దీనిని చూశారే గాని, ఆ పోలీస్ను కాపాడేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 4న మాయాపురి స్లమ్ ఏరియాకు చెందిన మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త మొబైల్ ఫోన్ను ఒక వ్యక్తి చోరీ చేసినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల ఏఎస్ఐ శంభు దయాల్ ఆ ప్రాంతానికి వచ్చారు. దొంగ అనీశ్ రాజ్ వద్ద చోరీ చేసిన మొబైల్ ఉండటాన్ని గమనించారు. అతడ్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
కాగా, దొంగ అనీశ్ రాజ్ తన వద్ద ఉన్న కత్తిని తీసి పోలీస్ అధికారి శంభు దయాల్పై దాడి చేశాడు. ఆయన మెడ, ఛాతి, కడుపు, శరీరంలో ఇతర చోట్ల 12 కత్తిపోట్లు పొడిచాడు. అయితే అక్కడున్న జనం పోలీస్ను కాపాడేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదు. పైగా కళ్లప్పగించి ఈ సంఘటనను చూశారు.
మరోవైపు దొంగ అనిశ్ రాజ్ అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వెంబడించగా మరో పోలీస్ పట్టుకుని అతడ్ని అరెస్ట్ చేశాడు. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ శంభు దయాల్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు.
రాజస్థాన్లోని సికర్కు చెందిన శంభు దయాల్కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోలీస్ హత్య పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి కోటి పరిహారం ప్రకటించారు. కాగా, పోలీస్పై దొంగ కత్తితో దాడి చేసిన ఈ సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CCTV shows Delhi Cop Stabbed Repeatedly, Crowd Watched, Did Nothing https://t.co/NwPPUd8a2g pic.twitter.com/ltSuaGqhWt
— NDTV (@ndtv) January 11, 2023
जनता की रक्षा करते हुए ASI शंभु जी ने अपनी जान तक की परवाह नहीं की। वे शहीद हो गये। हमें उन पर गर्व है।
उनकी जान की कोई क़ीमत नहीं पर उनके सम्मान में हम उनके परिवार को एक करोड़ रुपये की सम्मान राशि देंगे। https://t.co/RA3EW8MKXL
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2023