మణిపూర్ సీఎంకు డీసీడబ్ల్యూ చైర్పర్సన్ ప్రశ్న
ఇంఫాల్, జూలై 25: మణిపూర్ సీఎం బీరేన్సింగ్పై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ధ్వజమెత్తారు. ‘నగ్న ఊరేగింపు బాధిత మహిళలను నేను కలవగలిగినప్పుడు.. వారిని మీరు ఎందుకు కలవరు? పరామర్శించరు?’ అని ప్రశ్నించారు. స్వాతి మలివాల్ సోమవారం బాధిత కుటుంబాలను కలిసారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ తమ వద్దకు రాలేదని బాధిత కుటుంబాలు తనకు చెప్పాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, మహిళా శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. మణిపూర్కు వచ్చి ఏం జరుగుతున్నదో చూడాలని కోరారు.