న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal).. రోజు జైలు అధికారుల్ని ఇన్సులిన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. షుగల్ లెవల్స్ ఎక్కువ కావడంతో ఇన్సులిన్ కోసం కేజ్రీ జైలు అధికారుల్ని కోరుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నది. సీఎం ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారన్న జైలు అధికారుల వాదనను కేజ్రీవాల్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. జైలు సూపరింటెండెంట్కు కేజ్రీ లేఖ రాశారని, జైలు అధికారులు రాజకీయ వత్తిళ్ల ప్రకారం నడుచుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీ లేఖ రాసినట్లు వస్తున్న వార్తలపై తీహార్ జైలు అధికారులు ఇంకా స్పందించలేదు. డయాబెటిస్తో బాధపడుతున్న కేజ్రీకి జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అతన్ని చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు కూడా ఆ పార్టీ పేర్కొన్నది.