న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యం త రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో పదో స్థానంలో నిలిచింది. అఫీషియల్ ఎయిర్లైన్స్ గైడ్ (ఓఏజీ) షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ సామర్థ్యం ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. అమెరికాలోని హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదటి ర్యాంకు సాధించింది.