డెహ్రాడూన్: మదర్సా కాంప్లెక్స్లను కరోనా కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు డెహ్రాడూన్ ఖాజీ అహ్మద్ కస్మి తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అవసరమైన మద్దతు ఇస్తామని తెలిపారు. మదర్సా కాంప్లెక్స్లలో కరోనా కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని ఆయన వెల్లడించారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఏప్రిల్ 1న మొదలైన కుంభమేళా శుక్రవారంతో ముగిసింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 91 లక్షల మంది భక్తులు పవిత్ర దినాలలో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 1.81 లక్షలు, మరణాల సంఖ్య 2,600 దాటింది.