న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత ఆర్మీ కోసం 118 అర్జున్ ఎంబీటీ ఎంకే-1ఏ యుద్ధట్యాంకుల కొనుగోలు కేంద్ర రక్షణశాఖ చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకొన్నది. దీని విలువ రూ.7,523 కోట్లు. ఎంబీటీ ఎంకే-1ఏ యుద్ధట్యాంకులు అర్జున్ ట్యాంకులకు కొత్త వర్షన్. ఇందులో కొత్తగా 72 ఫీచర్లను చేర్చారు. ఈ యుద్ధ ట్యాంకులు ఎగుడుదిగుడు ప్రాంతాలతో పాటు ఎలాంటి నేలపై అయినా సులువుగా ప్రయాణించగలవు. వీటితో రాత్రి కూడా లక్ష్యాలను గుర్తించవచ్చు.