న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన కాల్పుల ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. ప్రియ మిత్రుడు షింజో అబేపై అటాక్ జరగడం తీవ్ర బాధను కలిగించిందని మోదీ తన ట్విట్టర్లో తెలిపారు. షింజో అబేతో పాటు ఆయన కుటుంబం, జపాన్ ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
Deeply distressed by the attack on my dear friend Abe Shinzo. Our thoughts and prayers are with him, his family, and the people of Japan.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా షింజో అబే మృతి పట్ల షాక్ వ్యక్తం చేశారు. తన మిత్రుడుపై దాడి జరగడం బాధాకరమన్నారు. షింజో కుటుంబసభ్యుల తరపున ప్రార్థిస్తున్నట్లు మన్మోహన్ వెల్లడించారు.