Pesticides | న్యూఢిల్లీ: పురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. గత 50 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో ఉండే కణాల సంఖ్య 50% తగ్గిపోయిందని పరిశోధకులు మెలిస్సా పెర్రీ వెల్లడించారు. ఇండ్లు, ఉద్యానవనాలు, ఆహారం మీద చల్లే ఆర్గానో ఫాస్ఫేట్స్, ఎన్-మిథైల్ కార్బమేట్స్ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె తెలిపారు.
ఈ పురుగు మందులు సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్ అలెగ్జాండర్ పాస్టుస్జాక్ తెలిపారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు ఈ పురుగు మందుల ప్రభావానికి ఎక్కువగా గురవుతారని వెల్లడించారు.