న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 28 శాతం నుంచి 31 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. డీఏ పెంపు వల్ల 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇది జూలై 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పెన్షనర్లకు కూడా డీఏను పెంచామని, వారికి కూడా ఈ లబ్ధి చేకూరుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఇక ఇవాళ ఇండియా ఓ గొప్ప ఫీట్ను అందుకున్నది. వ్యాక్సినేషన్లో బిలియన్ డోసులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలకు కంగ్రాట్స్ తెలిపారు. వంద కోట్ల మార్క్ను అందుకున్న సందర్భంగా దేశ ప్రజలకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు మంత్రి ఠాకూర్ వెల్లడించారు. అనుమానాలు, అపోహలు ఎన్ని ఉన్నా.. వ్యాక్సిన్ సెంచరీ ఘనతను సాధించామన్నారు.