న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ను మూడు శాతం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ డీఏ, డీఆర్ అదనపు ఇన్స్టాల్మెంట్ను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది.
ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రస్తుతం మూల వేతనం, పెన్షన్పై 31 శాతంగా ఉన్న డీఏ, డీఆర్లు మరో మూడు శాతం పెరుగుతాయి. ఏడవ కేంద్ర వేతన కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా తాజా పెంపును వర్తింపచేశారు. డీఏ, డీఆర్ పెంపుతో ఖజానాపై ఏటా రూ 9544 కోట్ల భారం పడుతుంది. తాజా నిర్ణయంతో 47.68 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.