హైదరాబాద్ : పండగ సీజన్ ప్రారంభంతో అత్యంత విశ్వసనీయ వజ్రాల బ్రాండ్లలో ఒకటైన డీబీర్స్ ఫరెవ్వర్ మార్క్ దక్షిణాదిలో వజ్రాల కోసం డిమాండ్ ఎక్కువగా వస్తుందని ఆశిస్తోంది కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వజ్రాలకు భారీ డిమాండ్ ను సంస్థ ఇప్పటికే చూసింది. రానున్న కొన్ని నెలల్లో 35 నుంచి 40 శాతం వరకు అధికంగా డిమాండ్ ఉంటుందని సంస్థ ఆశిస్తోంది. మరో వైపు ఈ బ్రాండ్ దేశంలో డీ బీర్స్ ఫరెవ్వర్ మార్క్ అతి పెద్ద మార్కెట్ అయిన దక్షిణాదిలో వృద్ధి చెందుతూనే ఉన్నది. పండగ సీజన్ గురించి డి బీర్స్ ఇండియా ఎండీ సచిన్ జైన్ మాట్లాడుతూ వజ్రాల వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.