ముంబై: గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim)కు చెందిన భూమిని వేలం వేశారు. నాలుగు ప్రాపర్టీలను వేలం వేయగా, దాంట్లో రెండింటికి ఎవరూ పోటీపడలేదు. ఇక 15వేల బేస్ ప్రైస్తో వేలం వేసిన ఓ ప్లాట్కు రెండు కోట్లు దక్కాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబేకే గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని ఇవాళ వేలం వేశారు. 1730 చదరపు మీటర్లు ఉన్న ఓ ప్లాట్పై రిజర్వ్ ప్రైస్ 1.56 లక్షలు కాగా, ఆ ప్లాట్ 3.28 కోట్లకు అమ్ముడుపోయింది. 170.98 చదరపు మీటర్లు ఉన్న ఓ భూమికి బేస్ ప్రైస్ను 15వేలుగా ఫిక్స్ చేశారు. అయితే ఆ ల్యాండ్ రెండు కోట్లకు సేల్ అయ్యింది. అజయ్ శ్రీవాత్సవ్ అనే లాయర్ దీన్ని కొనుగోలు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్కు చెందిన మూడు ప్రాపర్టీలను గతంలో కూడా ఈయనే కొన్నారు. 1976 నాటి స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్టు కింద దావూద్ ఆస్తులను వేలం వేశారు.