భోపాల్, జూలై 18: మధ్యప్రదేశ్లో దళిత మహిళా సర్పంచ్పై కొంతమంది బూట్లతో దాడికి తెగబడ్డారు. శివ్పురి జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటన సోషల్మీడియాలో వచ్చింది. పహాడి గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశామని, ముగ్గురిని అరెస్టు చేయనున్నామని జిల్లా పోలీసులు తెలిపారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం, మహిళా సర్పంచ్ కుమారుడ్ని నిందితుల్లో ఒకడు కొట్టాడు. దీనిపై ఫిర్యాదు చేయటానికి మహిళా సర్పంచ్ పోలీస్స్టేషన్కు వెళ్తుండగా..ముగ్గురు అడ్డుకొని దాడికి దిగారు. బురదలోకి లాక్కెళ్లి బూట్లతో కొట్టారని బాధిత సర్పంచ్ ఆరోపించారు.