Dam malware | న్యూఢిల్లీ, మే 27: స్మార్ట్ఫోన్లకు ‘దామ్’ అనే మాల్వేర్ ముప్పు ఉన్నదని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మాల్వేర్ ఫోన్ను హ్యాక్ చేసి అందులోని కాల్ రికార్డులు, కాంటాక్టులు, బ్రౌజింగ్ హిస్టరీ, కెమెరా, గ్యాలరీ వంటి వాటిని తస్కరిస్తుందని పేర్కొన్నది. ఈ మాల్వేర్ పట్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద యూఆర్ఎల్స్ను క్లిక్ చేయవద్దని కోరింది.
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని సూచించింది. అనుమానాస్పద యూఆర్ఎల్ను క్లిక్ చేయడం ద్వారా ‘దామ్’ మాల్వేర్ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. స్మార్ట్ఫోన్లోని సమాచారాన్ని తస్కరించిన తర్వాత ఫోన్లోని సమాచారాన్ని డిలీట్ చేసేస్తుంది. ఈ మాల్వేర్ స్మార్ట్ఫోన్లలోని సెక్యూరిటీ ప్రోగ్రామ్లను కూడా బోల్తా కొట్టించగలదని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది.