అతివేగంతో కారు నడిపి, ఇన్ఫోసిస్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతికి కారణమైనందుకు డాక్టర్ అనహిత పండోల్ మీద మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె భర్త డారియస్ పండోల్ని కూడా విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే, ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. కారు ప్రమాదానికి గురైన టైంలో అనహిత కారు నడుపుతున్నారు. ఆమె మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
డివైడర్ని ఢీ కొట్టడంతో
సెప్టెంబర్ 5వ తారీఖున మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ కారు మహారాష్ట్రలోని పల్ఘార్ దగ్గర అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. ఆ టైంలో కారులో సైరస్ సైరస్ మిస్త్రీ, అతని స్నేహితుడు జహంగీర్, అవనిత, ఆమె భర్త ఉన్నారు. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు అతని స్నేహితుడు అక్కడిక్కడే మరణించారు. అవనిత, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.