ముంబై: ముంబై విమానాశ్రయంలో (Mumbai airport) భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్ (Muscat) నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ (Customs) అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఓ వ్యక్తివద్ద 4.2 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. దాని విలువ రూ.2.28 కోట్లు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని పొడిగా మార్చి (Gold dust) పాయింటు లోపల, లోదుస్తులు, మోకాలికి ధరికి క్యాప్ల్లో తరలిస్తున్నాడని తెలిపారు. విచారణ నిమిత్తం నిందితుడిని తమ ఆదీనంలోకి తీసుకున్నామని చెప్పారు.
కాగా, గత నెలలో ముంబై ఎయిర్పోర్టులో విదేశీ సిగరేట్లను (Foreign-origin cigarettes) అక్రమంగా తరలిస్తున్నందుకుగాను 55 కేసులు నమోదుచేసినట్లు కస్టమ్స్ (Mumbai Customs) అధికారులు వెల్లడించారు. మొత్తం 9,36,700 సిగరెట్లను సీజ్ చేశామని తెలిపారు. వాటి విలువ రూ.41 లక్షలు ఉంటుందన్నారు.