అహ్మదాబాద్: కస్టమ్స్ అధికారులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం స్పీకర్ బాక్స్ లోపల దాచిన రూ.4.26 కోట్ల విలువైన బంగారాన్ని శుక్రవారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన 6ఇ-1478 విమానంలో తనిఖీల సందర్భంగా ఫ్లైట్ ఇంజినీర్ల సాయంతో విమానం ముందు వైపు ఉన్న మరుగు దొడ్డి దగ్గర ఉన్న స్పీకర్ బాక్స్ లోపల నల్లని ప్లాస్టిక్ టేప్తో సీల్ చేసిన రెండు చిన్న సంచులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
వాటిలో 2,799.3 గ్రాముల బరువున్న 24 విదేశీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం తమదేనని విమాన సిబ్బంది, ప్రయాణికులెవరూ ప్రకటించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి దాన్ని భారత్లోకి అక్రమ రవాణా చేసి ఉంటాడని భావిస్తున్నారు.