న్యూఢిల్లీ: కస్టమ్స్ అధికారులు ఎంతమంది స్మగ్లర్స్ ఆటకట్టించినా స్మగ్లింగ్ మాత్రం యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ఎయిర్పోర్టులో స్మగ్లర్స్ పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారత జాతికి చెందిన ఓ స్మగ్లర్ పట్టుబడ్డాడు. అతడి నుంచి 14 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బహ్రెయిన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చిన అతని తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని లగేజీని చెక్ చేయగా 14 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. వాటి మొత్తం బరువు 1483 కిలోలు ఉన్నదని, వాటి విలువ సుమారుగా రూ.68.71 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని సీజ్ చేసి, నిందితుడి అరెస్ట్ చేశారు.