ముంబయి: కస్టడీ మరణం అనేది నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు చెప్పింది.
‘ఈ సభ్య సమాజంలో కస్టోడియల్ మృతి అన్నది అతి దుర్మార్గమైన నేరం. పోలీసులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పౌరులను ఇలా అమానవీయ రీతిలో హింసకు గురిచేయడం తగదు’ అని ఔరంగాబాద్ బెంచ్ స్పష్టంచేసింది.