న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. వేలం డబ్బును గంగానదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘నమామీ గంగ మిషన్’కు వినియోగిస్తామని పేర్కొన్నది. వేలం జాబితాలో అయోధ్య రామమందిరం, చార్ధామ్, రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ నమూనాలు, ఒలింపిక్స్ విజేతల సామగ్రి, పెయింటింగ్స్ తదితరాలు ఉన్నట్టు వెల్లడించింది. ఆసక్తిగల వారు సెప్టెంబర్ 17-అక్టోబర్ 7 మధ్య pmmementos.gov.in వెబ్సైట్ ద్వారా ఈ-వేలంలో పాల్గొనవచ్చు.