న్యూఢిల్లీ, ఆగస్టు 13: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ-యూజీ 4వ ఫేజ్ పరీక్ష వాయిదా పడింది. ఈ ఫేజ్లో పరీక్ష రాయనున్న 11 వేల మంది అభ్యర్థులకు కోరుకొన్న చోట పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా పరీక్షను ఈ నెల 30కి వాయిదా వేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ శనివారం తెలిపారు. ఎన్టీఏ నిర్వహిస్తున్న సీయూఈటీ-యూజీ కోసం 3.72 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నెల 17-20 మధ్య నాలుగు దశల్లో పరీక్ష నిర్వహించాలని మొదట నిర్ణయించారు. పలు కారణాలతో కొన్నిచోట్ల పరీక్షలు వాయిదా పడటంతో ఈ నెల 28 వరకు ఆరు దశల్లో నిర్వహించాలని తర్వాత నిర్ణయించారు. అయినా కూడా సెంటర్లు సరిపోలేదు.