కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) 2022లో పాల్గొనేందుకు కర్ణాటక రాష్ట్రంలోని 25 యూనివర్సిటీలు అంగీకరించాయి. ఈ మేరకు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్ జగదీశ్కుమార్ వెల్లడించారు. దేశంలో ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా సీయూఈటీ నిర్వహిస్తున్నారు.
కర్ణాటకలోని 25 యూనివర్సిటీల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సీఈయూటీ స్కోర్ను ఆధారం చేసుకునేందుకు ఆయా వర్సిటీల వీసీలు ముందుకురావడాన్ని స్వాగతిస్తున్నామని జగదీశ్కుమార్ ట్విటర్ పోస్ట్లో తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీకాం, ఇతర అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ను ఆధారం చేసుకోవచ్చన్నారు. మొదట దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయవిశ్వ విద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీని ప్రవేశపెట్టారు. అనంతరం ఏ యూనివర్సిటీలైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.