న్యూఢిల్లీ : బీజేపీని ఓడించేందుకు అన్ని ‘లౌకిక ప్రజాస్వామ్య శక్తులు’ ఏకం కావాలని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళలోని కన్నూర్లో ప్రారంభమైన సీపీఐ (ఎం) 23వ పార్టీ మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతతత్వానికి వ్యతిరేకంగా అన్ని లౌకిక శక్తులతో విశాల ఫ్రంట్స్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ దిశలో ఎలా ముందుకెళ్లాలో పార్టీ కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు.
ఇవాళ మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోరాటం, కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం లౌకికవాదాన్ని రాజీ లేకుండా నిలబెట్టడం ద్వారా మార్గాన్ని చూపిందన్నారు. కుల, లింగ భేదం లేకుండా సమానత్వాన్ని గౌరవిస్తూ, అదే సమయంలో నయా ఉదారవాద ఎజెండాకు ప్రత్యామ్నాయంగా ప్రజానుకూల విధానాలను అమలు చేయాలని కోరుతున్నారన్నారు. ఫలితాలు అందరూ చూడగలిగేలా ఉన్నాయని, నేడు ప్రపంచం కేరళ ఉన్నత స్థాయి మానవాభివృద్ధి సూచికలను ప్రశంసిస్తోందన్నారు. ఐదు రోజుల పార్టీ కాంగ్రెస్ రాబోయే మూడేళ్లలో పార్టీ రాజకీయ దిశను నిర్దేశిస్తుందన్నారు.