పాట్నా, ఫిబ్రవరి 10: బీహార్లో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు ఇప్పటివరకు మహాఘటబంధన్ భాగస్వామిగా ఉన్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ శాసనసభా పక్ష నేత మెహబూబ్ ఆలం శనివారం ఎన్డీయే భాగస్వామి, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీని కలిశారు. విశ్వాస పరీక్షకు 48 గంటల ముందు కలవడంపై ఆయన స్పందిస్తూ ఇందులో రాజకీయమేదీ లేదని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న సీపీఐ (ఎంఎల్) నేత ఎన్డీయేకు మద్దతు ఇస్తారని బీహార్లో ఊహాగానాలు వస్తున్నాయి. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్డీయేకు కావాల్సిన దానికన్నా అరుగురు అధికంగా 128 మంది సభ్యులున్నారు.