న్యూఢిల్లీ: జాతీయ జంతువుగా ఆవును గుర్తించే ఉద్దేశంలో ప్రభుత్వమున్నదా? అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సూటిగా సమాధానం చెప్పలేదు. పశువుల సంరక్షణపై చట్టాలు చేసే అధికారం రాష్ర్టాలకు ఉన్నదని, ఈ విషయంలో రాష్ర్టాలు, యూటీలు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా కేంద్రం కూడా రాష్ట్రీయ గోకుల్ మిషన్ను అమలు చేస్తున్నదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టత లేని సమాధానం ఇచ్చారు.