న్యూఢిల్లీ, మార్చి 25: రాబోయే రెండేండ్లలో ఒమిక్రాన్ కంటే తీవ్రమైన కరోనా వేరియంట్ పుట్టుకురావొచ్చని, అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు చేరిందన్న విశ్లేషణలను ఆయన కొట్టిపారేశారు. ఆసియా, ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘మనకు మరిన్ని సర్ప్రైజ్లు ఇవ్వడానికి వైరస్ సిద్ధంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరు ముగియడానికి ఇంకా చాలా సమయం ఉందని పేర్కొన్నారు.