న్యూఢిల్లీ : వచ్చే మార్చిలో 12-14 సంవత్సరాల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం తెలిపారు. మార్చి నాటికి 15-18 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ టీకా వేయడం పూర్తి చేయాలని భావిస్తున్నామని, ఆ తర్వాత 12-14 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించొచ్చన్నారు.
15-18 సంవత్సరాల మధ్య 7.4 కోట్ల (7,40,57,000) పిల్లలు ఉండగా.. ఇప్పటి వరకు 3.45 కోట్ల మందికిపైగా టీకాలు తీసుకున్నారని, వారందరికీ రెండో డోసు 28 రోజుల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి నాటికి మొదటి డోస్ పూర్తి చేసి.. ఫిబ్రవరి వరకు రెండో డోసు వేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో 12-14 సంవత్సరాల వయసు గల పిల్లలకు టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డాక్టర్ ఎన్కే అరోరా వివరించారు.
ఇమ్యునైజేషన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రకారం.. 12-14 ఏళ్ల మధ్య దేశంలో 7.5 కోట్ల మంది పిల్లలున్నారని అంచనా. ఇవాళ్టి ఉదయం వరకు అందిన సమాచారం మేరకు 127.20కోట్లకుపైగా టీకాలు వేశారు. ఇందులో 15-18 సంవత్సరాల పిల్లలకు 3.45 కోట్ల మోతాదుల టీకాలు పంపిణీ చేశారు.