న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో కరోనా విజృంభించినప్పుడు విడుదలైన దోషులు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి అప్పట్లో వీరిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గడంతో 15 రోజుల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. తర్వాత విచారణ ఖైదీలు సాధారణ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.