న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు, శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ఎంఆర్ఎన్ఏ తరహా కొవిడ్ టీకాల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలంటూ వైద్య, ఆరోగ్య నిపుణులు సంతకం చేసిన ‘హోప్ అకార్డ్’ పిటిషన్ తాజాగా పిలుపునిచ్చింది.
దీని వల్ల అనేక ప్రమాదాలు ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నది. టీకాలపై తిరిగి సమగ్రమైన మూల్యాంకనం జరపాలని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ టీకాలకు భిన్నమైనవి ‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) టీకాలు. వీటితో ఏర్పడే దుష్ప్రభావాల్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా వినియోగంలోకి తీసుకొచ్చారని పలు అధ్యయనాలు సైతం తెలిపాయి.