Corona | కరోనా ఇలాగే వుంటుందా? పోతుందా? కరోనా అంతం ఎప్పుడు? ఇప్పుడు అందరి మనస్సుల్లో ఇవే ప్రశ్నలు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ఎపిడమాలజికల్ అధిపతి సిమ్రాన్ పండా కీలక ప్రకటన చేశారు. మార్చి 11 నాటికి కరోనా ఎపిడెమిక్ స్థాయి నుంచి ఎండెమిక్ స్థాయికి వచ్చేస్తుందని ప్రకటించారు. అయితే ప్రజలందరూ కరోనా నియమాలను కచ్చితంగా పాటిస్తూ, కొత్త వేరియంట్ పుట్టకపోతే మాత్రం కరోనా ఎండెమిక్ స్థాయికి వచ్చేస్తుందని తేల్చి చెప్పారు. ఎండెమిక్ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరోనా ఉంటుందని అర్థం.
‘ప్రజలందరూ కచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తూ వుంటే, కొత్త వేరియంట్లు పుట్టకపోతేనే మార్చి 11 నాటికి కరోనా ఎపిడెమిక్ స్థాయి నుంచి ఎండెమిక్ స్థాయికి చేరుకుంటుంది. డెల్టా కనుమరుగై, ఒమిక్రాన్ ఉంటేనే కరోనా ఎండెమిక్ స్థాయికి వచ్చేస్తుంది.’ అని సిమ్రాన్ పండా తెలిపారు. మార్చి 11 నుంచి కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని, ఢిల్లీ, ముంబైలో తీవ్రత ఇలాగే వుంటుందా? లేక మార్పు వస్తుందా? అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, కాస్త సమయం పడుతుందన్నారు.