న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కరోనా నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను వచ్చేనెల 30 వరకు కేంద్రం పొడిగించింది. కొన్ని రాష్ర్టాల్లో వైరస్ కేసులు పెరుగుతుండటం, పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం లేఖ రాసింది. కరోనా నియంత్రణ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలు వచ్చేనెల 30 వరకు కొనసాగుతాయని ఆ లేఖలో పేర్కొంది. కరోనా ఖతం అయినట్టు భావించరాదని, వైరస్ నియంత్రణ కోసం తీసుకొచ్చిన మార్గదర్శకాలను ప్రజలు తప్పక పాటించాలని సూచించింది.