బెంగళూరు : కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. చిక్కమంగళూరులోని జవహర్ నవోదయ పాఠశాలలోని రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హాస్టల్లో 101 మంది విద్యార్థులు, సిబ్బందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఆదివారం 69 మంది విద్యార్థులకు వైరస్కు పాజిటివ్గా పరీక్షించిన విషయం తెలిసిందే. సోమవారం మరికొంత మంది పరీక్షలు చేయగా.. కేసుల సంఖ్య వంద దాటింది.
మొత్తం 90 మంది విద్యార్థులు, 11 మంది సిబ్బందికి వైరస్ సోకింది. అయితే, అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపటనున్నట్లు చిక్కమంగళూరు ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమేష్ తెలిపారు. అయితే, వైరస్ బారినపడ్డ వారిలో కొవిడ్ లక్షణాలు ఏవీ కనిపించలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది అందరినీ ఐసోలేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు.