దేశం కోసం వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దుబిడ్డ మహావీరచక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీవినీ ఎరుగని రీతిలో అందించిన సాయం ఆ కుటుంబానికి మాత్రమే ఇచ్చిన ధైర్యం, భరోసా కాదు.. యావత్ దేశంలోని ఆర్మీ కుటుంబాలకు ఇచ్చిన ధైర్యం. చరిత్రలో కర్నల్ సంతోష్ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు. దేశంకోసం ప్రాణత్యాగంచేసిన సంతోష్బాబును ఈ దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటారు.
– మంత్రి కేటీఆర్
సూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : దేశం కోసం వీరమరణం పొందిన సూర్యాపేట ముద్దుబిడ్డ మహావీరచక్ర కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సాయం కేవలం ఆ కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, భరోసా మాత్రమేకాదు.. యావత్ దేశంలోని ఆర్మీ కుటుంబాలకు ఇచ్చిన ధైర్యమని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కర్నల్ సంతోష్ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని సూర్యాపేట కోర్టు చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని మంగళవారం మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత కోర్టు చౌరస్తాకు సంతోష్బాబు పేరును నామకరణంచేశారు. అనంతరం రూ.22 కోట్ల వ్యయంతో మెయిన్ రోడ్డు విస్తరణ, రూ.8 కోట్లతో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ యా ర్డులో వెజ్,నాన్వెజ్ మార్కెట్, తదితరాలకోసం నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా పాత మార్కెట్యార్డులో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కర్నల్ సంతోష్బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారన్నారు. గతేడాది ఇదే రోజున కర్నల్ సంతోష్బాబు వీరమరణం వార్త తెలిసినవెంటనే అందరం దిగ్భ్రాంతికి లోనయ్యామని గుర్తుచేసుకొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు హకీంపేట నుంచి సూర్యాపేట వరకు వారి కుటుంబానికి అండగా ఉండి మనోధైర్యం కల్పించే ప్రయత్నంచేశామన్నారు. తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యుడు, మంత్రి జగదీశరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణను అభినందించారు. విగ్రహ రూపశిల్పి, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన శ్రీనివాస్రెడ్డిని ప్రశంసించారు.
ప్రతి ఒక్కరూ గుర్తించేలా జీవించాలి..
‘పెద్దలు సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. పుట్టిన ప్రతిఒక్కరం మరణించక తప్పదు.. ఎవ్వ రూ వెయ్యేండ్లు ఉండడానికి రారు.. కానీ జీవించి ఉన్నంతకాలం ఏం సాధించాం.. పోయినంక మనం చేసినవి గుర్తించేలా జీవించాలి.. అలాగే దేశంకోసం ప్రాణత్యాగంచేసిన సంతోష్బాబును తప్పకుండా తెలంగాణ రాష్ట్రం, దేశం ఉన్నంతకాలం ఈ దేశ ప్రజలు ఎప్పటికి గుర్తు పెట్టుకుకొంటారు.. వారి త్యాగాలు గుర్తుంచుకుంటారు’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. సంతోష్బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచి చేసిన అత్యున్నత సహకారం చేయడం దేశంలో ప్రతి ఆర్మీ కుటుంబానికీ, ప్రతి జవాను కుటుంబాలకు ఇచ్చిన ధైర్యమని తెలిపారు. ప్రతి సైనిక కుటుంబానికి భరోసా ఇచ్చేలా స్ఫూర్తిని కల్పించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సందేశం ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సూర్యాపేటలో జగదీశ్రెడ్డి ఇంత మంచి కార్యక్రమం చేయడం అభినందనీయని పేర్కొన్నారు. తాము మంత్రులుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటామని, అయితే చాలా కొన్ని కార్యక్రమాలు మాత్రమే అత్మ సంతృప్తిని కల్గించేవి ఉంటుండగా అందులో విగ్రహావిష్కరణ అత్యంత ప్రధానమైందన్నారు.
ఆర్మీ కుటుంబాలకు భరోసా: జగదీశ్రెడ్డి
ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ దేశంకోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలను అత్యంత గొప్పగా ఆదరిస్తూ ఆదుకోవాలని దేశానికే స్ఫూర్తిదాయకంగా ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి సాయం అందించారని విద్యుత్శాఖ మంత్రి, జగదీశ్రెడ్డి అన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ యువనాయకుడు, ఆశాకిరణం, రేపటి తెలంగాణకు నాయకుడు మంత్రి కేటీఆర్ వచ్చి ప్రారంభించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, సైదిరెడ్డి, భూపాల్రెడ్డి, భాస్కర్రావు, పైళ్ల శేఖర్రెడ్డి, నోముల భగత్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సూర్యాపేట జెడ్పీ చైర్పర్సన్ దీపికాయుగంధర్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సోమా భరత్కుమార్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సంతోష్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆ అండ చెప్పనలవి కానంత
కర్నల్ సంతోష్బాబు ప్రాణత్యాగం వార్త విన్న మేం దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాకిచ్చి న అండ, సాయం చెప్పనలవి కానంత. హైదరాబాద్లో దిగిన క్షణంలోనే మంత్రి కేటీఆర్ వచ్చి పరామర్శించడం, సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి అన్నీతానై చూడ టం మర్చిపోలేనివి. సీఎం కేసీఆర్ స్వయం గా వచ్చి సూర్యాపేటలో మా కుటుంబాన్ని పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన సం తోష్ను తీసుకురాలేం.. కానీ మీకు పౌరసమాజం తరపున నేను ధైర్యం ఇస్తామంటూ ఇచ్చిన భరోసా మామూలుది కాదు. రూ.5 కోట్ల నగదు, హైదరాబాద్లో ఇంటి స్థలంతోపాటు నాకు గ్రూప్-1 ఉద్యోగమిచ్చారు. నాకు గుర్తున్నంతవరకు మిలటరీలో చనిపోయిన కుటుంబాలకు దేశంలోనే ఎక్కడా ఈస్థాయి సహకారం అందించలేదు. ఇకమీదట దేశం మొత్తం ఇ దేస్ఫూర్తి కొనసాగుతుందని భావిస్తున్నాం.