న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల వ్యాక్సినేషన్ నెమ్మదించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలను కోరింది. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులు, ఎన్హెచ్ఎం ఎండీలతో కొవిడ్ వ్యాక్సినేషన్పై శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
విదేశాలకు వెళ్లాలనుకునే వారు రెండో డోస్ తర్వాత 90 రోజుల్లోపు ప్రికాషన్ డోస్ తీసుకోవాలనుకునే వారంతా పర్యటనకు సంబంధించిన వివరాలు అందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 191కోట్ల డోసులు అందించామన్నారు. రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు ‘హర్ ఘర్ దస్తక్ 2.0’కి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.