Rajastan MLA’s resignation | అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో రాజస్థాన్ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కు నోటీసు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ వినోద్కుమార్ బహర్వానీలు విచారించారు. ఈ పిటిషన్ను రాజేంద్ర రాథోడ్ గత వారం హైకోర్టులో దాఖలు చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు విధేయులైన మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు దాదాపు 90 మంది సెప్టెంబర్ 25న తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి సమర్పించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉండాలని గెహ్లాట్ నిర్ణయించిన సమయంలో గెహ్లాట్ వారసుడిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించింది. అయితే, గెహ్లాట్ విధేయులు సీఎల్పీ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
గెహ్లాట్ విధేయులు చేసిన రాజీనామాలను ఆమోదించాలని ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం అక్టోబర్ 18 న అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు. గత 90 రోజులుగా ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనందున కోర్టు జోక్యం చేసుకోవడం అత్యవసరమని తన పిటిషన్లో పేర్కొన్నారు.