
రాయ్పూర్: జీవితంలో మధురానుభూతిని మిగిల్చే పెండ్లిని కొందరు ఎంతో ఆడంబరంగా చేసుకుంటారు. ప్రత్యేకించి వధువరులు వినూత్నంగా పెండ్లి వేదికపైకి చేరేందుకు ఈవెంట్ మేనేజర్లు వివిధ ఆలోచనలతో రకరకాల ఏర్పాట్లు చేస్తుంటారు. కాగా, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఆదివారం ఎంతో అట్టహాసంగా జరిగిన ఒక పెండ్లిలో అపశృతి చోటుచేసుకుంది. ఒకవైపు డ్యాన్సులు, మరోవైపు విద్యుత్త్ కాంతులతో మెరిసిపోతూ, బాణసంచా వెలుగులు విరజిమ్మే అందంగా అలంకరించిన ఒక ఊయలపైకి వధువరులు ఎక్కారు. అది మెల్లగా పైకి లేచింది. అంతలోనే ఉన్నట్టుండి ఊయలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోయింది. దీంతో 12 అడుగుల ఎత్తు నుంచి వధువరులు కిందపడ్డారు. వారిద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి.
కాగా, పెండ్లికి హాజరైన వారంతా ఇది చూసి ఉలిక్కిపడ్డారు. వధువరులను రక్షించేందుకు కొందరు వారి వద్దకు పరుగులుపెట్టారు. ఈ నేపథ్యంలో పెండ్లి వేడుక 30 నిమిషాలు వాయిదా పడింది. ఆ తర్వాత మిగతా పెండ్లి క్రతువులు జరిగాయి.
మరోవైపు ఈ ఘటనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాధ్యత వహించి క్షమాపణలు చెప్పింది. కాగా, కొందరు తమ మొబైల్స్లో చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Unfortunate accident at Raipur Wedding yesterday.
— Amandeep Singh 💙 (@amandeep14) December 12, 2021
Thank God all are safe.
source : https://t.co/yal9Wzqt2f pic.twitter.com/ehgu4PTO8f