బెంగళూరు, ఫిబ్రవరి 17: నిద్రిస్తున్న బిడ్డను క్యాబ్లో మర్చిపోయి.. దిగిపోయిన దంపతులు, ఆ విషయాన్ని గంట తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసుల సాయం కోరగా.. వారు రంగంలోకి దిగి నాలుగేండ్ల చిన్నారిని సురక్షితంగా దంపతులకు అప్పగించారు. కర్ణాటకలోని హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 14న ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణిని పోలీసులు తప్పుబట్టగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు పోలీసులు సదరు క్యాబ్ లొకేషన్ను ట్రాక్ చేశారు. డ్రైవర్ ఫోన్ నంబర్ సంపాదించి.. అతడితో మాట్లాడి వెనక్కి రప్పించారు. నాలుగేండ్ల చిన్నారి క్యాబ్లోనే సురక్షితంగా ఉందని డ్రైవర్ చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.