బెంగళూరు: మెట్రో స్టేషన్లో ఒక జంట అసభ్యకరంగా ప్రవర్తించారు. (Couple Engages In Obscene Act) ఆ స్టేషన్లో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా వారి చర్యను పట్టించుకోలేదు. ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మాదావర మెట్రో స్టేషన్లోని ప్లాట్ఫారమ్పై కొందరు వ్యక్తులు మెట్రో రైలు కోసం వేచి ఉన్నారు. ఒక యువ జంట కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. అబ్బాయి తన స్నేహితురాలైన అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె టీ షర్టు లోపలకు తన చేతిని చొప్పించాడు. కొందరు ప్రయాణికులు కూడా ఆ జంట సమీపంలో ఉన్నారు. అయినప్పటికీ తమకేమీ పట్టనట్లుగా వారు వ్యవహరించారు.
కాగా, ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ మెట్రో కల్చర్ వైపు వెళ్తోందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆ జంట స్థానికులు కాదని ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడి కల్చర్ను నాశనం చేస్తున్నారని ఒకరు విమర్శించారు. అయితే ఈ వీడియో క్లిప్ను షేర్ చేయడంపై మరి కొందరు మండిపడ్డారు.
Is Bengaluru Heading Towards Delhi metro Culture???
Disturbing Public Behavior at Namma Metro Station Raises Questions About Decency in BengaluruIt is extremely disappointing and concerning to witness the kind of behavior that some individuals are now displaying in public… pic.twitter.com/4hBAnK1R7p
— Karnataka Portfolio (@karnatakaportf) April 10, 2025