జైపూర్: రాజస్థాన్లోని (Rajasthan) భిల్వారా (Bhilwara) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. తమ కుమారుడితో కలిసి హోలీ ఆడిన దంపతులు.. స్నానానికని వెళ్లి బాత్రూమ్లో ఊపిరాడక (Suffocation) చనిపోయారు. శివ్నారాయణ్ ఝన్వర్, కవితా ఝన్వర్ భార్యాభర్తలు. వారికి ఐదేండ్ల తమ కుమారుడు విహాన్ (Vihaan) ఉన్నారు. తమ కుమారుడితో కలిసి సరదాగా హోలీ వేడుక జరుపుకున్నారు. అనంతరం అతడికి స్నానం చేయించడానికి ముగ్గురూ కలిసి బాత్రూమ్లోకి వెళ్లారు. అయితే అప్పటికే అందులో ఉన్న గీజర్ నుంచి గ్యాస్ (Geyser gas) లీకవడంతో (Leak) ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు.
అయితే రెండు గంటలైనా ఎంతకూ వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు స్నానాల గది తలుపులు తట్టారు. ఎవ్వరూ తీయకపోవడంతో దానిని పగలగొట్టి చూడగా.. వారు ముగ్గురు అచేతనావస్థలో ఉన్నారు. వెంటనే వారిని జిల్లా దవాఖానకు తీసుకెళ్లారు. అయితే దంపతులిద్దరు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. వారి కుమారుడు విహాన్కు చికిత్స అందిస్తున్నారని పోలీసు అధికారి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.