ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న అంశం కరోనా. ఈ వైరస్ ఎంతటి విలయం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ గురించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఏ, బీ, ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఓ, ఏబీ, ఆర్హెచ్ నెగిటివ్ గ్రూపుల బ్లడ్ ఉన్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
ఈ పరిశోధన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇక్కడి సర్ గంగారామ్ హాస్పిటల్లో పరిశోధకులు ఈ విషయంపై అధ్యయనం చేశారు. మొత్తం 2,586 మంది కరోనా పేషెంట్లపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయని సమాచారం. అంతేకాదు, ఒకే రకం బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల కంటే అదే బ్లడ్ గ్రూప్ ఉన్న పురుషులకే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.