నవాబ్పేట, ఏప్రిల్ 7 : మండలంలో వివిధ కారణాలతో ఖాళీగా ఏర్పడిన పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధిం చి ఓటర్ల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో తెలియజేయాలని ఎంపీడీవో శ్రీలత కోరారు. ఉప ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మండలం లో ఖాళీగా ఏర్పడిన 7 వార్డులకుగానూ నూ తనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను నాయకులకు అందజేశారు. అభ్యంతరాలను ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయాలని సూచించారు. సమావేశం లో మండల ప్రత్యేకాధికారి సుధాకర్, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీవో భద్రునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని న ర్సింహులు, టీడీపీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి నర్సింహ, ఆర్ఐ జ్ఞానేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సురేందర్ ఉన్నారు.