ముంబై: ఫ్రీగా ఫుడ్ ఇవ్వనందుకు ఒక రెస్టారెంట్ మేనేజర్ను పోలీస్ కొట్టాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ పాటిల్ బుధవారం మధ్య రాత్రి వేళ శాంతాక్రూజ్ ఈస్ట్లోని స్వాగత్ డైనింగ్ బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లాడు. మద్యం సేవించి ఉన్న ఆయన తనకు ఫుడ్ పెట్టాలని అక్కడి సిబ్బందిని డిమాండ్ చేశాడు.
అయితే అప్పటికే కిచెన్ను మూసేసినట్లు మేనేజర్ గణేష్ పాటిల్ చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆ పోలీస్ అధికారి మేనేజర్పై చేయి చేసుకుని పలుమార్లు చెంపపై కొట్టాడు. సిబ్బంది వచ్చి ఆయనను పక్కకు లాగినప్పటికీ మరోసారి మేనేజర్పై దాడి చేశాడు. రెస్టారెంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.