చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. దీనిపై ఉదయనిధి తండ్రి, సీఎం స్టాలిన్ స్పందించారు. ‘సనాతనం బోధించే కొన్ని సూత్రాలు దళిత, గిరిజన, మహిళలపై వివక్ష చూపేలా ఉన్నాయి.
వీటి గురించే ఉదయనిధి మాట్లాడారు. అంతేగానీ ఓ మతాన్నిగానీ, కులాన్నిగానీ కించపర్చే ఉద్దేశం లేదు’ అని తెలిపారు. మరోవైపు డీఎంకే ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ.. ‘మంత్రి ఉదయనిధి చాలా సాఫ్ట్గానే పోల్చారు. మలేరియా, డెంగ్యూతో సరిపెట్టారు. కానీ సనాతన ధర్మాన్ని హెచ్ఐబీ, కుష్ఠు వ్యాధులతో పోల్చాలి’అని పేర్కొన్నారు.