రంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్పల్లి వద్ద మంత్రా మాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విదేశీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను టార్గెట్ చేసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మంత్రా మాల్ వద్ద శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు మాటు వేసి డ్రగ్స్ విక్రయిస్తున్న సూడాన్, యెమెన్ దేశస్థులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిద్దరూ బంజారాహిల్స్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద ఉన్న డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.