అమృత్సర్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటింగ్లో అవిభక్త కవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవిభక్త కవలలైన సోహ్నా సింగ్, మోహ్నా సింగ్.. అమృత్సర్లోని (Amritsar) మనావాలాలో తొలిసారిగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒకే శరీరాన్ని పంచుకుంటున్న ఈ సోదరులకు ఎన్నికల కమిషన్ వేర్వేరుగా ఓటుహక్కు కల్పించింది.
2002 జూన్ 13న జన్మిన ఈ కవలలు 2020లో 18 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ వారికి వేర్వేరుగా ఎపిక్ కార్డును అందించింది. ఈ నేపథ్యంలో తొలిసారగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు నమోదేచేసుకున్నారు. ఒక శరీరాన్ని పంచుకుంటున్నప్పటికీ వేర్వేరుగా ఓటు వేయడం పట్ల సోదరులు ఆనందం వ్యక్తంచేశారు.
పంజాబ్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో 93 మంది మహిళలు ఉన్నారు. 2.14 కోట్ల మంది ఓటువేయనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.