న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో త్వరలో జరుగనున్న ఎన్నికలకు 89 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ బుధవారం మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 37 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ‘లడ్ కీ హూ… లడ్ సక్ తీ హూ’ (నేను బాలికను.. అయినా పోరాడగలను..) నినాదంతో మహిళా అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను పార్టీ జనరల్ సెక్రెటరీ ముకుల్ వాస్నిక్ విడుదల చేశారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడుత ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 255 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.